Monday, April 29, 2024

ఉగ్రవాదుల కాల్పులకు ఇద్దరు పౌరుల మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని ధంగీ ప్రాంతంలో స్థానిక పౌరులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది స్థానికులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఉగ్రమూకల కోసం భద్రతాదళాలు గాలిస్తున్నాయి. అయితే కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని మరో ఎనిమిది మంది గాయపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. గత రెండు వారాల్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇది రెండో సంఘటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News