- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 42,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 947మందికి కరోనా సోకింది. అదే సమయంలో 377 మంది బాధితులు నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,97,810 చేరగా, అందులో 8,85,892 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ బారిన పడి 7,203 మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
947 new covid-19 cases reported in AP
- Advertisement -