- Advertisement -
రాయ్ పూర్: జనతా కాంగ్రెస్ అధ్యక్షడు, చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కోమాలోకి వెళ్లారు. శనివారం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలిన అజిత్ జోగిని కుటుంబ సభ్యులు రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆదివారం ఆయన కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, మందులకు ఆయన శరీరం ఎలా స్పందిస్తుందన్న విషయం తెలియడానికి 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని.. అప్పటివరకు ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు.
Chhattisgarh Former CM Ajit Jogi Slips Into Coma
- Advertisement -