- Advertisement -
హైదరాబాద్: అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించనున్నారు. జిల్లాలవారీగా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సిఎం సమీక్షిస్తున్నారు. అవసరమైతే సహాయక చర్యల్లో పాల్గోవాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. రాబోయే నాలుగు రోజులపాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనం స్థంబించింది. తొతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇళ్లకే పరిమితం అయ్యారు.
CM KCR high level meeting on Rains in Telangana
- Advertisement -