Friday, May 17, 2024

విదిషలో సుష్మా స్మారక విగ్రహం

- Advertisement -
- Advertisement -

Statue of Sushma Swaraj will be erected at Vidisha

 

భోపాల్ : కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ విగ్రహాన్ని మధ్యప్రదేశ్‌లోని విదిషలో ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం తెలిపారు. విదిష నుంచే సుష్మా స్వరాజ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కేంద్ర మంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ వక్తగా, పార్లమెంటేరియన్‌గా ఖ్యాతివహించారు. ఆదివారం సుష్మా స్వరాజ్ జయంతి నేపథ్యంలో ముఖ్యమంత్రి చౌహాన్ తమ నివాసంలో జరిగిన కార్యక్రమంలో నివాళులు అర్పించారు. పలువురు మంత్రులు, బిజెపి సీనియర్ నేతలు ఈ సందర్భంగా వచ్చారు. దేశానికి సుష్మా అందించిన సేవలను ప్రస్తుతించారు. ఈ దశలోనే సిఎం తమ ప్రసంగంలో సుష్మా విగ్రహాన్ని విదిష టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News