Friday, May 17, 2024

వదిన ప్రాణం తీసిన మరిది ప్రేమ వివాహం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: ప్రేమ పెళ్లి ఒకరి ప్రాణం తీసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెన్నచర్ల గ్రామంలో సంపంగి కృప, ఆత్మకూరి సంతోష్ గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమంచుకుంటున్నారు. జూన్ 5న పెళ్లి చేసుకొని పారిపోయారు. కోపంతో రగిలిపోయిన అమ్మాయి బంధువులు లక్ష్మయ్య, లింగస్వామి, శాంతమ్మ గొడ్డలి తీసుకొని సంతోష్ వదిన ఉష, అన్నయ్య చెన్నయ్యపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఉష, చెన్నయ్య వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉష పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉష కన్నుమూసింది. ఆమెకు కూతురు, కుమారుడు ఉన్నాడు. డిఎస్‌పి హరిబాబు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News