Friday, May 17, 2024

రాష్ట్రంలో 200 దిగువకు కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -
170 covid-19 cases reported in telangana
కొత్తగా 170 కేసులు నమోదు

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారి కొవిడ్ పాజిటివ్ కేసులు 200 దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 170 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,65,068కు పెరిగింది. తాజాగా 259 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,56,544 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.71 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,612 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం 34,200 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News