- Advertisement -
బైంసా: నిర్మల్ జిల్లా బైంసా గడ్డన్న వాగు ప్రాజెక్ట్లో గజ ఈతగాడు దుర్మరణం చెందాడు. సిసి కెమెరా రికార్డు ఆధారంగా గజ ఈతగాడు మృతిపై పలు అనుమానాలు ఉన్నట్టు సమాచారం. సాయినాథ్ అనే ఈతగాడు డ్యామ్లో దూకినట్టు కెమెరాలో రికార్డైంది. కొద్దీ దూరం ఈత కొట్టినట్టు కూడా కెమెరాలో రికార్డు అయింది. తరువాత నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గత ఈతగాడు ఎలా చనిపోయాడనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -