Monday, April 29, 2024

గొంతులో పకోడి తట్టుకుని 13 నెలల బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

ముస్తాబాద్ : పకోడి గొంతులో తట్టుకుని 13 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొమురం భీం కౌటాల మండలంలోని వెల్దండి గ్రామానికి చెందిన కూలీలు మారుతి, కవిత దంపతుల 13 నెలల వయస్సు ఉన్న బాలుడు క్రాంతితో జీవనం కొనసాగిస్తున్నారు.

సోమవారం మంచూరియా తిటూ ఉండగా బాలుడి గొంతులో తట్టుకుని శ్వాస ఆడకపోవడంతో తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. బాలుడి మృతదేహం వద్ద తల్లి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News