Friday, May 17, 2024

అభాగ్యులకు అండగా భరోసా సెంటర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం బ్యూరో : న్యాయం కోసం వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచి… వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి భరోసా సెంటర్ సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్న భరోసా సెంటర్, షీ టీం వారు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హింసకు గురైన బాలికలు మహిళలకు రక్షణ కల్పించేందుకు షీ టీం, భరోసా పనిచేస్తున్నాయని, వీటి ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరుగుతుందని, ఆపదలో ఉన్నారని సమాచారం అందగానే వెంటనే స్పందించి అందుబాటులో ఉంటూ వారికి రక్షణ కల్పిస్తారని చెప్పారు. భరోసా సెంటర్ నుండి ముగ్గురు బాధిత బాలికలు మరియు మహిళకు భరోసా సహాయ నిధి నుండి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అవినాష్ కుమార్, ఎసిపి ప్రసన్న కుమార్, ట్రాఫిక్ సిఐలు అంజలి, నవీన్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పరిధిలోని అంగన్వాడీలు, డిఆర్‌డిఓ పరిధిలోని ఐకెపిలు, మహిళా ప్రాంగణం నుండి ట్రైనింగ్‌లో ఉన్న బాలికలు, సఖి సిబ్బంది, షీటీం, ఏహెచ్‌టియు, సైబర్ క్రైమ్ భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News