Monday, April 29, 2024

గిరిజనుల దశాబ్దాల కల నెరవేరింది

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన, సాహసోపేత నిర్ణయం వల్ల తెలంగాణ రాష్రటలో 2845 గ్రామ పంచాయతీ తండాల్లో 1.50 లక్షల మందికి 4.35 లక్షల ఎకరాల పోడు పట్టాలుగా పంపిణీ చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది భారతదేశంలోనే ఒక రికార్డుగా అభివర్ణించారు. బుధవారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి జిల్లాకు సంబంధించిన గిరిజన లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గిరిజనులు అటవి ప్రాంత ంలో ఉంటూ దశాబ్దాల కాలంగా పోడు భూమిని సాగు చేసుకుంటూ భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని, అలాంటి గిరిజనులు తమ భూమి దక్కుతుందో లేదో అనే బెంగ నిత్యం పెట్టుకుని జీవించే వారని, అలాంటి గిరిజన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం వల్ల అటవి హక్కుల పత్రాన్ని అర్హులైన వారందరికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకుండా అటవి శాతా న్ని హరితహారం ద్వారా మొక్కలు నాటి ఏడు శాత ం అడవిని పెంచడం జరిగిందన్నారు. ఇక ముందు గిరిజనులు ఎవరు కొత్తగా చెట్లు నరకకుండా హా మీ పత్రం తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎక్కడైనా సరైన సర్వే చేయకుం డా లేదా సరైన పత్రాలు సకాలంలో చూపించడం లో జాప్యం జరిగి అర్హత ఉండి పట్టాలు రాని వారికి మరోమారు సర్వే చేయించి అర్హులైన వారందరికి పోడు పట్టాలు అందించే విధంగా చర్యలు తీసుకు ంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు పట్టా లు రానివారు ఎలాంటి బెంగ పెట్టుకోకుండా నిశ్చి ంతగా ఉండాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు వస్తాయని తెలిపారు. పోడు పట్టాలు పొ ందిన రైతులు ఎకరాకు 15 చెట్ల చొప్పున పెంచాలని, తద్వారా అడవిని సంరక్షించాల ని తెలిపారు.

చెట్లు పెంచితేనే జీవకోటికి మనుగడ అని అవి మనుషులకు ఏ ప్రాణవాయువు అందిస్తుందన్నా రు. తండాల్లో నాగరికత పెరిగి ప్రతి ఒక్కరు బాగా చదువుకుని అభివృద్ధి చె ందారని దానికి కా రణం వారిలో ఉ న్న కష్టపడే తత్వమని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పి చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు పోడు భూ మి ఒక ప్రధాన సమస్యగా ఉండేదని, పోడు సాగుచేసుకునేందుకు రైతులకు అటవి శాఖ ద్వారా ఆం క్షలు ఉండేవన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం దశాబ్దాల గిరిజన రైతుల కల నెరవేర్చిందని, గిరిజన పోడు రైతులకు అటవి హక్కుల పత్రాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇకమీదగ పోడు పట్టాల రైతులకు సైతం రైతు బంధు, రైతు భీమా లభిస్తుందని, అందువల్ల వడ్డీ వ్యాపారం చేసే దళారుల చేతుల్లో మోసపోవద్దని రైతులకు సూచించా రు. ఎవరైనా రైతులు వాణిజ్య పంటలు సాగు చేస్తే బ్యాంకుల ద్వారా సబ్సిడి రుణాలు సైతం లభిస్తుందన్నారు.

నేడు పోడు పట్టాలు పొందిన రైతులకు ఎంతో సంతోషః ఉందో అంతకంటే ఎక్కువ సంతో షం ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి, మండల స్థాయిలో కమిటీలు పరిశీలన చేసి చివరగా జిల్లా స్థాయి కమిటీ ద్వారా 415 మంది రైతులకు, 481 ఎకరాల భూమికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ అటవి హక్కుల పత్రం పొందేందుకు అర్హులుగా నిర్దారించడం జరిగిందన్నారు. వీరందరికి నేడు మంత్రి చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నా రు. పోడు పట్టాలు జారీ చేయడంలో సహకరించిన మంత్రి, అటవి శాఖ సిబ్బందికి, గిరిజన అభివృద్ధి శాఖ సిబ్బంది, కమిటీ సభ్యులకు కలెక్టర్ ధ న్యవాదాలు తెలిపారు.

వనపర్తి జిల్లాలో సాగు నీ రు, తాగునీరు పుష్కలంగా ఉన్నందు వల్ల వలస పో యిన వారు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుని వ్య వసాయం, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోడు పట్టాలు పొం దిన గిరిజన మహిళా రాజపేట మండలం పెద్దతం డా మహిళా రైతు కట్రావత్ ధర్మాని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల మా కల నేడు సాకారం చేసినందుకు ముఖ్యమంత్రికి, మంత్రి నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్‌ఓ నవీన్ రెడ్డి, డిటిడిఓ శ్రీనివాస్, మున్సిపల్ చై ర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రమేష్ గౌడ్, ఘనపూర్ ఎంపిపి కృష్ణా నాయక్, జెడ్పిటిసి సామ్య నాయక్, ఎంపిటిసి ధర్మ నాయక్, సర్పంచ్ పిన్యా నాయక్, జాత్రు నాయక్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News