Sunday, April 28, 2024

శ్రీశైలం డ్యాం వద్ద మంటలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టు 12వ గేటు వద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం విద్యుత్‌షార్ట్ సర్కూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. 12వగేట్ వద్ద ఉన్న ఛేంజ్ ఓవర్ స్విచ్ బోర్డులో మంటలు వ్యాపించాయి. వర్షం పడే సమయంలో స్విచ్ ఆన్‌చేయడంతో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చేలరేగాయి. అక్కడే ఉన్న సిఐఎఫ్‌ఎఫ్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. తర్వాత రిపేర్లు నిర్వహించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News