Monday, April 29, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో సిఎంకు 39వ స్థానం

మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేయగా, అందులో సిఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనిని విడుదల చేసింది. ఇందులో మొదటి మూడు స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు.

ఇక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి 39 వ స్థానంలో ఉండగా, ఎపి సిఎం జగన్ 56 వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ 16 , సోనియా గాంధీ 29 , మల్లిఖార్జున ఖర్గే 36 , ప్రియాంక గాందీ 62 స్థానాల్లో ఉన్నారు. అంతేగాక ఈ జాబితాలో పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, సినీ కళాకారులు, క్రీడాకారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News