మెగాస్టార్ చిరంజీవి,- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కామ్రేడ్ ‘సిద్ధ’గా చరణ్ కనిపించనున్నాడు. తూర్పు గోదావరి జిల్లా – మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ చిరంజీవి, – చరణ్లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే తన భుజంపై తండ్రి చేయి వేసిన పిక్ ఒకటి షేర్ చేసిన చరణ్.. ‘ఇది కామ్రేడ్ సమయం! ‘ఆచార్య’ సెట్లో నాన్న(చిరంజీవి), కొరటాల శివతో ప్రతిక్షణం ఆనందిస్తున్నా’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో చరణ్ ’ఆచార్య’ కోసం తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడని తెలిసింది.
మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో తన తండ్రి చిరంజీవితో కలిసి 20 రోజుల లాంగ్ షెడ్యూల్లో పాల్గొన్న రామ్చరణ్.. తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు ఘన సన్మానం చేసి వీడ్కోలు పలికిందని సమాచారం. సతీమణి ఉపాసనతో కలిసి చరణ్ రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తిరిగి రాగా అభిమానులు ఎయిర్పోర్ట్కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే తండ్రీకొడుకులు చిరు, – చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్ కిచ్లు నటిస్తుండగా.. చరణ్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, – కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.