- Advertisement -
తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య పై నటి నటి ఖుష్బూ స్పందించింది. నేను ఓ సందర్భంలో ఎంతో మానసికి క్షోభను ఎదుర్కొన్నాను, దాంతో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని ఖుష్బూ ట్వీట్ చేసింది. నన్ను కృంగదీయాలనే సమస్యల కంటే నేను ఎంతో స్ట్రాంగ్ అని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నానని ఆమె ట్విట్టర్లో స్పందించారు. ఖుష్బూ తెలుగులో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా పరిచయమైన ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్గా తన పేరున గుడి కట్టేంత ఇమేజ్ సంపాదించుకుంది ఖుష్బూ. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటిని అధిగమించి మన జీవితం కొనసాగించాలన్నారు. ప్రతి మనిషి బాధ, ఒత్తిడి ఉంటాయి. అది లేవని చెబితే అబద్ధమే అవుతుందన్నారు.
- Advertisement -