Monday, April 29, 2024

ఎట్టకేలకు భారత పౌరసత్వం పొందిన అక్షయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్షయ్ కుమార్ ఇప్పుడు అధికారికంగా భారతీయ పౌరుడిని అని ప్రకటించారు. అతను తన కొత్త భారత పౌరసత్వ పత్రాల ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గతంలో అక్షయ్ కెనడా పౌరుడు కావడంతో కొందరు విమర్శలు చేశారు. 2010లో తనకు “ద్వంద్వ పౌరసత్వం” ఉందని ఒకసారి చెప్పినప్పటికీ, ఆ తర్వాత 2019లో కెనడియన్ హోదాను వదిలి భారతీయ పాస్‌పోర్ట్ పొందడం గురించి మాట్లాడాడు.

ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, అక్షయ్ ఇలా పంచుకున్నాడు. “నా హృదయం, పౌరసత్వం రెండూ ఇప్పుడు హిందుస్థాన్ వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జైహింద్” అంటూ ట్వీట్ చేశారు. అక్షయ్ ప్రస్తుతం తన తాజా విడుదలైన OMG 2 విజయంలో దూసుకుపోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News