Sunday, April 28, 2024

నూతన మంత్రులకు చాంబర్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

సచివాలంలో కొలువుదీరనున్న మంత్రులు
ఇప్పటికే కోమటిరెడ్డి పదవీ బాధ్యతలు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో నూతన ప్రభుత్వ కొలువుదీరడంతో కొత్త మంత్రులకు డా.బిఆర్. అంబేద్కర్ సచివాలయంలో పలు అంతస్తుల్లో చాంబర్లు కేటాయించారు. ఇప్పటికే రోడ్ల, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మిగతా 10మంది మంత్రులకు చాంబర్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించింది.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు రెండో అంతస్తుల్లో రూమ్ నెం 10, 11,12, నల్లమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాలుగో అంతస్తు రూమ్ నెం 27,28,29, దామోదర్ రాజనర్సింహ్మకు రెండో అంతస్తుల్లో రూమ్ నెం. 13,14,15, డి. శ్రీధర్‌బాబు మూడో అంతస్థు రూమ్ నెం 10,11,12, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గ్రౌండ్ ప్లోర్ రూమ్ నెం 10,11,12, పొన్నం ప్రభాకర్ ఐదో అంతస్తు రూమ్ నెం 27,28,29, కొండా సురేఖ నాలుగో అంతస్తు రూమ్ నెం. 10,11,12, దససూరి అనసూర్య సీతక్క మొదటి అంతస్తు రూమ్ 27,28,29, తుమ్మల నాగేశ్వర్‌రావు మూడో అంతస్తు రూమ్ నెం 27,28,29, జూపల్లి కృష్ణారావు నాలుగో అంతస్తు రూమ్ 13,14,15 కేటాయించారు. వీరంతా రెండుమూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News