Monday, April 29, 2024

మంత్రి కెటిఆర్ సాయం కోరిన యాంకర్ రష్మి గౌతమ్… ఏం జరిగిందంటే..?

- Advertisement -
- Advertisement -

Anchor Rashmi Gautam seeks the help of Minister KTR

 

మన తెలంగాణ/హైదరాబాద్: బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మీగౌతమ్ స్వతహాగా జంతు ప్రేమికురాలు. మూగ జీవాలకు హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్‌డౌన్‌లోనూ వీధికుక్కలకు, పావురాల కోసం ప్రతిరోజు ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా పలు అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తోంది. తాజాగా రష్మీ రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను ఓ విషయంపై విజ్ఞప్తి చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శునకాలకు ఎబిసి(యానిమల్ బర్త్ కంట్రోల్) ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రి కెటిఆర్‌ను కోరింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా కెటిఆర్ కార్యాలయ ఖాతాతో పాటు కెటిఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.

గత కొంతకాలంగా జిహెచ్‌ఎంసీ పరిధిలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి అలాగే వదిలిపెడుతున్నారు. ఆపరేషన్ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే వదిలిపెడుతున్నారు. అయితే అలాంటి శునకాల ఫోటోలను వివరాలతో సహా సేవ్ యానిమల్స్ ఇండియా అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలంగా ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్ చేసి, ఇలాగే నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. పై అధికారులు తమకు విధించిన టార్గెట్ రీచ్ కావడం కోసం వైద్య సిబ్బంది ఇలా శునకాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై మంత్రి కెటిఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News