Saturday, April 27, 2024

యాంటిబయోటిక్ దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

Antibiotic

 

ఎక్కువగా గ్రామాలు, చిన్న పట్టణాల్లోని క్లినిక్‌లలోనే
చిన్న పిల్లలకు ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు రాస్తున్న డాక్టర్లు
ఫ్లస్ వన్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి
రిటైల్ రంగంలో 22 శాతం పెరిగిన తలసరి వినియోగం

హైదరాబాద్: దేశంలో యాంటిబయోటిక్ దుర్వినియోగం అధికంగా ఉంది. అందులోనూ చిన్న పిల్లలకు అత్యధికంగా యాంటిబయోటిక్స్ మందులు డాక్టర్లు రాస్తున్నట్లు తేలింది. యాంటిబయాటిక్స్ మందుల దుర్వినియోగం ప్రధానంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ఆసుపత్రులు, క్లినిక్‌లలో అధికంగా జరుగుతోంది. ఈ మేరకు ఫ్లస్ వన్ అనే మెడికల్ జర్నల్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం పెద్ద నగరాల్లోని ఆసుపత్రుల్లో యాంటిబయాటిక్స్ ప్రిస్క్రప్షన్లు అంతగా ఉండట్లేదని, అయితే కిందిస్థాయిలో నిఘా అవసరమని సూచించింది. అలాగే యాంటిబయోటిక్ ప్రిస్క్రిప్షన్లలో 33.2 శాతం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు రాస్తున్నారు. మన దేశంలో రిటైల్ రంగంలో తలసరి యాంటిబయోటిక్ వినియోగం 22 శాతం పెరగడాన్ని కూడా అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశంలో అధిక యాంటిబయోటిక్ వాడకానికి ప్రధాన కారణం అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలడమేనని పేర్కొంది.

అయితే వివిధ కారణాలతో చనిపోయే ఐదేళ్లలోపు పిల్లల్లో 50 శాతం మంది న్యుమోనియా, విరేచనాలు వంటి అంటువ్యాధుల కారణంగానే చనిపోతున్నారని, అయితే ఈ యాంటి బయాటిక్స్ కేవలం తీవ్రమైన అంటువ్యాధుల చికిత్సకు ఉద్దేశించినవి కావని తేలింది. దేశంలో నాలుగేళ్లలోపు పిల్లల్లో ప్రతి వెయ్యిలో 636 మందికి యాంటిబయోటిక్స్ రాస్తున్నారు. 10 నుంచి 19 ఏళ్ల వయసు వారికి అతి తక్కువగా వెయ్యిలో 280 మందికి ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు. ప్రెవేటు ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. అయితే యాంటిబయోటిక్ రెసిస్టెన్స్ ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని కొందరు నిపుణులైన డాక్టర్లు చెబుతున్నారు. యాంటిబయోటిక్స్ రెసిస్టెన్స్ ఒక సామాజిక విషాదంగా మారిందని, యాంటిబయోటిక్స్ లేని రోజుల్లో చిన్నపాటి జబ్బులు కూడా ప్రాణాంతకంగా మారేవి. కానీ అవే యాంటిబయోటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం వల్ల, అవసరమైనప్పుడు అసలు ఏ మందులూ పనిచేయని పరిస్థితి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ యాంటిబయోటిక్స్ హానికర అలర్జీలు, విరేచనాలు, గుుండె జబ్బులు, కండరాల సమస్యలు వంటి దుష్ర్పభావాలు కలగుజేస్తాయంటున్నారు.

ప్రతి వెయ్యి మందికి ప్రిస్క్రిప్షన్ రేటు 412
భారత్‌లో యాంటిబయోటిక్ ప్రిస్క్రిప్షన్ రేటు వెయ్యి మందికి 412 ప్రిస్క్రిప్షన్లుగా ఉంది. ఇక ఇటలీలో యాం టిబయోటిక్ ప్రిస్క్రిప్షన్ రేటు వెయ్యి మందికి 957 ప్రిస్క్రిప్షన్లు, జర్మనీలో 561 ప్రిస్క్రిప్షన్లు, యూకేలో 555 ప్రిస్క్రిప్షన్లు, డెన్మార్క్‌లో 481 ప్రిస్క్రిప్షన్లుగా ఉంది. వివిధ యూరోపియన్ దేశాల కంటే తక్కువగానే ఉంది. అదే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కొన్ని యాంటిబయోటిక్ ప్రిస్క్రిప్షన్ల రేటు మన దేశంలో ఎక్కువ ఉందని తెలిపింది. యాంటిబయాటిక్స్ అనుచిత వాడకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, మన కేంద్రం పలు చర్యలు చేపట్టింది. యాంటిబయోటిక్స్ డిమాండ్ తగ్గించడానికి, సార్వత్రిక రోగ నిరోధకత కోసం కొత్త టీకాలు ప్రవేశపెట్టింది.

అలవాట్లు.. నిర్లక్షంతోనే
మన అలవాట్లు, నిర్లక్ష్యం వల్ల ఈ యాంటిబయోటిక్స్‌కు బాక్టీరియా తలొగ్గే పరిస్థితి లేకుండా పోతుంది. ఆయా మందులకు లొంగట్లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా యాంటిబయోటిక్ రెసిస్టెన్స్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మొదటి దశ యాంటిబయోటిక్స్ చికిత్స వల్ల ఫలితం లేనప్పుడు మరింత ఖర్చుతో కూడుకున్న సమర్థమైన యాంటిబయోటిక్స్ వాడాల్సి ఉంటుంది. యాంటి బయోటిక్స్ పనిచేయకపోవడం వల్ల చికిత్సా కాలం పెరుగుతుంది. అనారోగ్య బాధ పెరుగుతుంది. ఆసుపత్రుల్లో ఉండే కాలం పెరుగుతుంది. వైద్యం ఖర్చు పెరిగి కుటుంబాలు, సమాజాలపై ఆర్థిక భారం పెరుగుుతుంది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు పెద్ద సవాలుగా నిలిచిన సమస్య యాంటి బయోటిక్ రెసిస్టెన్స్ అని నిపుణులు అంటున్నారు.

Antibiotic abuse
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News