Saturday, April 27, 2024

పివి సింధుకు ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించిన ఎపి

- Advertisement -
- Advertisement -

అమ‌రావ‌తి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ బ్యాడ్మింట‌న్ పివి సింధుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమవారం రూ.30 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించింది. రాష్ట్ర క్రీడా విధానంలో భాగంగా సింధుకు ప్రకటించిన న‌గ‌దు బ‌హుమ‌తి ఇవ్వాల‌ని ఎపి సిఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఎపి క్రీడా విధానం ప్ర‌కారం పసిడి పతకం గెలిస్తే రూ.75 ల‌క్ష‌లు, రజత పతకం గెలిస్తే రూ.50 ల‌క్ష‌లు, కాంస్యం గెలిస్తే రూ.30 ల‌క్ష‌ల బహుమతిని ఇవ్వ‌నున్నారు. కాగా, పివి సింధు వరుసగా రెండు ఒలింపిక్స్ మెడ‌ల్స్ సాధించిన తొలి భారతీయ మహళగా చరిత్ర సృష్టించింది.

AP Govt announces rs 30 lakh cash prize to PV Sindhu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News