- Advertisement -
అమరావతి: తెలుగు రాష్ట్రాలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 334, ఆంధ్రప్రదేశ్ 252 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎపిలో కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో మరో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కు చేరుకోగా.. మృతుల సంఖ్య 3కు చేరుకుంది.
AP Govt Confirm 14 New Corona Cases rise in State
- Advertisement -