Monday, April 29, 2024

నేడు రాహుల్, మల్లికార్జున ఖర్గేల రాక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఖర్గే చేరుకొనున్నారు. అక్కడి నుంచి 11 గంటలకు ఆయన గాంధీభవన్‌కు చేరుకుంటారు. అనంతరం టిపిసిసి మేనిఫెస్టో కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో ఖర్గే పాల్గొన నున్నారు. సమావేశం అనంతరం ఖర్గే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రాత్రి హైదరాబాద్‌లోనే ఆయన బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరిగి ఖర్గే బెంగుళూరు వెళ్లనున్నారు.
నేడు 5 నియోజకవర్గాల్లో రాహుల్ సుడిగాలి పర్యటనలు
రాహుల్ గాంధీ నేడు 5 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు రాహుల్ పినపాకకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ రాహుల్ పాల్గొంటారు. పినపాక నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేట జరిగి రోడ్ షోలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గాంధీ వరంగల్ ఈస్ట్‌కు చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్కడి నుంచి వరంగల్ వెస్ట్‌కు రాహుల్ గాంధీ వెళతారు. అక్కడి నుంచి సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌కు రాహుల్ గాంధీ వస్తారు. రాజేంద్రనగర్‌లో జరిగే సమావేశం అనంతరం ఢిల్లీకి రాహుల్ గాంధీ బయలుదేరి వెళ్లనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News