Saturday, April 27, 2024

ప్రారంభమైన ఆషాడ మాసం బోనాలు…

- Advertisement -
- Advertisement -

Ashadam bonalu start in Hyderabad

హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఆషాడ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు. ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News