Saturday, April 27, 2024

12వందల కోసం స్నేహితులపై దాడి

- Advertisement -
- Advertisement -

Money

మాదన్నపేట్: 12 వందల రూపాయల కోసం ఓ వ్యక్తి తన ప్రాణ స్నేహితులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హఫీజ్ బాబానగర్‌కు చెందిన మోసిన్(32),రియాజ్,ఇర్షద్‌లు స్నేహితులు. వీరు గత కొద్ది కాలం క్రితం చిన్న పిల్లలకు సంబంధించిన పంపేర్స్(డైపర్స్) వ్యాపారం చేశారు. వ్యాపారంలో భాగంగా రూ.1200లు మోసిన్ నుంచి రియాజ్, ఇర్షద్‌లకు రావాల్సి ఉంది.

కానీ మోసిన్ వారికి డబ్బు ఇవ్వడం లేదు. ముగ్గురు బాబానగర్‌లోని ఓ మెడికల్ హాల్ వద్ద కలుసుకోని మిగతా డబ్బు కోసం మోసిన్‌తో గొడవకు దిగారు. ఇంతలో అలీ అనే మరో వ్యక్తి వచ్చి వారికి సర్ది చెప్పి పంపించాడు. ఇంతలో గెలాక్సి పాఠశాల వద్దకు రియాజ్, ఇర్షర్, అలీలు చేరుకోగానే మోసిన్ పండ్ల కత్తితో వారిపై దాడి చేసి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను హాస్పటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Attacked on friends for 12 hundred Rupees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News