Monday, April 29, 2024

అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం… అడ్డుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం శనివారం కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి హఠాత్తుగా అసెంబ్లీ ముందుకు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, చందనపల్లికి చెందిన రైతు భూసేకరణలో తనకు అన్యాయం జరిగిందని, ఇప్పటి వరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును పోలీసులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News