Sunday, April 28, 2024

అవార్డులు ఎంతో స్ఫూర్తినిస్తాయి

- Advertisement -
- Advertisement -

కోల్‌సిటీ: అవార్డులు ఎంతో స్ఫూర్తినిచ్చి వారి వారి రంగాలలో మరింత ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహిస్తాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనికి చెందిన ప్రేమచారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులు దాసరి స్వప్న మహేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విభిన్న రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురికి మెడల్స్, మెమోంటో, రికార్డు సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభకు ప్రోత్సాహమందిస్తే ఎన్నో అద్భుతాలు సాధిస్తారని అన్నారు. సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, సమాజంలో భిన్నంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజా ధారణ పొందుతున్న వారు, పలు రంగాలలో తమ ప్రతిభను చాటుకొని ప్రజల మన్ననలు పొందుతున్న వారిని గౌరవించడం, సత్కరించడం మన బాధ్యతని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News