- Advertisement -
ముంబయి: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టిఆర్పి) రిగ్గింగ్ కుంభకోణంలో అరెస్టు అయిన రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ వికాస్ ఖాన్చందానికి స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఖాన్చందానీని గత ఆదివారం ఆయన నివాసంలో క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సిఐయు) అధికారులు అరెస్టు చేశారు. రూ. 50,000 నగదు పూచీకత్తుపై ఖాన్చందానీకి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన న్యాయవాది నితీన్ ప్రధాన్ తెలిపారు. కొన్ని చానళ్లు టిఆర్పి రిగ్గింగ్కు పాల్పడుతున్నట్లు రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్(బార్క్) హంసా రిసెర్చ్ ఏజెన్సీ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు.
- Advertisement -