Saturday, April 27, 2024

తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీ: తలసాని

- Advertisement -
- Advertisement -

Best policy to Telugu cinema industry

 

హైదరాబాద్: లాక్‌డౌన్‌తో సినిమా, టివి సీరియల్స్ షూటింగ్‌లు నిలిచిపోయాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినిమా షూటింగ్‌లు, థియోటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రంగాలపై ఆధారపడ్డ లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. షూటింగ్‌లు, థియోటర్ల ఓపెనింగ్‌పై ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు సి కల్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్ శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్‌డిసి మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు, జీవిత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News