Monday, April 29, 2024

రేపే భగవంత్ మాన్ మంత్రివర్గ విస్తరణ!

- Advertisement -
- Advertisement -

Bhagwant Mann

5 నుంచి 6 మంది కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది!

చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం పంజాబ్‌లో తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఒక మహిళతో సహా కనీసం ఐదుగురు మంత్రులు చేరవచ్చని భావిస్తున్నారు, దాని మొత్తం బలం 15 కి పెరుగనుంది. సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ప్రమాణస్వీకారానికి సమయం కావాలని పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపినట్లు సమాచారం. శుక్రవారం ఢిల్లీలో సీఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిగిన సమావేశంలో విస్తరణపై చర్చించినట్లు సమాచారం.

గురు హర్సహై ఎమ్మెల్యే ఫౌజా సింగ్ సరారీ, ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అమృత్‌సర్ సౌత్ ఎమ్మెల్యే డాక్టర్ ఇందర్బీర్ సింగ్ నిజ్జర్, ఖరార్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరమజ్రా, సునమ్ ఎమ్మెల్యే అమన్ అరోరా భగవంత్ సింగ్ మాన్ కేబినెట్‌లో చేరే అవకాశం ఉంది.

ప్రస్తుతం కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు తొమ్మిది మంది మంత్రులున్న సంగతి తెలిసిందే. ఒక మంత్రి – డాక్టర్ విజయ్ సింగ్లా – అవినీతి ఆరోపణలపై పదవీచ్యుతుడయ్యాడు. దీంతో కేబినెట్‌లో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News