- Advertisement -
డెహ్రాడూన్: కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. బిజెపి ఎంఎల్ఎకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. సురేంద్ర సింగ్ జీనాకు (50) కరోనా వైరస్ సోకడంతో 15 రోజుల క్రితం ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సదరు ఎంఎల్ఎ చనిపోయాడు. సురేంద్ర సింగ్ భార్యకు కరోనా వైరస్ సోకింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. అల్మోరా జిల్లా స్టాల్ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున ఎంఎల్ఎగా గెలుపొందారు. ఎంఎల్ఎ మృతిపై ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -