Monday, April 29, 2024

బోనమెత్తిన గొల్కోండ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: గోల్కొండ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి గురువారం భక్తులు భక్తి శ్రద్ధ్దలతో తొలిబోనం సమర్పించారు. దీంతో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. మంత్రులు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు ప్రభుత్వం తరుపున జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా గోల్కొండ కోట అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. బోనాల ఉత్సవాల్లో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా లంగర్ హౌజ్ వద్ద అమ్మవారి తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభించారు. ఈ తొట్టెల ఊరేగింపు డప్పు చప్పులు, పోతురాజుల నృత్యాల మధ్య చోటా బజార్, బడా బజార్, ఫతే దర్వాజా, గోల్కొండ చౌరస్తాల నుంచి గొల్కోండ కోటకు చేరుకుంది. లంగర్‌హౌజ్ నుంచి గోల్కొండ కోట వరకు సాగిన తొట్టెల ఊరేగింపు సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని చోట్ల మంచినీటి సౌకర్యంతో పాటు మొబైల్ టాయిలెట్లు, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. బోనాల ఉత్సవాల్లో నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
తల్లి చల్లని చూపుతో రాష్ట్రం సుభిక్షం : మంత్రులు
ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీలు మాట్లాడుతూ తెలంగాణ నడి బొడ్డున జగదంబికా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఎ ంతో సంతోషంగా ఉందన్నారు. బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా ప్రతిఏటా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జూలైలో నిర్వహించుకోనున్న సికింద్రాబాద్.. లాల్ దర్వాజ్ హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన చెప్పారు.

2014 నుంచి 2022 వరకు బోనాల వేడుకలకు ప్రభుత్వం రూ.78.15 కోట్లు నిధులను ఖర్చు చేసిందని, ఈ నిధులను ప్రతి ఏటా 3,033 ఆలయాలకు పంపిణీ చేశామని చెప్పారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు ఈ ఏడాది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని అమ్మవారి చల్లని చూపుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా, ప్రజలందరూ ఆయూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండేలా ఆకాంక్షిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News