Wednesday, May 1, 2024

చాక్లెట్ కోసమని వెళ్తే… బాలుడి పైనుంచి వెళ్లిన బస్సు

- Advertisement -
- Advertisement -

Boy dead in Bus accident in Krishna dist

అమరావతి: చాక్లెట్ కోసమని వెళ్లిన బాలుడు బస్సు వెనక చక్రాల కిందపడి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాసరావు, ప్రభావతి అనే దంపతులు కోడూరులో జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఆదిత్య, దినేష్ కుమార్ కుమారులు ఉన్నారు. ఆదిత్య ఎల్‌కెజి చదువుతుండడంతో స్కూల్ బస్సు ఎక్కించడానికి రోడ్డుపైకి వచ్చారు. తల్లిని అనసరిస్తూ దినేష్ వెళ్లాడు. చాకెట్లు బస్సు వెనక చక్రాల సమీపంలో పడడంతో తీసుకోవడానికి వంగాడు. అదే సమయంలో డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో బాలుడి తల టైర్ కింద చిధ్రమైపోయింది. తండ్రి వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. డ్రైవర్ నిర్లక్షంతోనే తన కుమారుడు మరణించాడని దినేష్ తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News