Monday, April 29, 2024

ఓటీటీలోకి మమ్ముట్టి భ్రమయుగం!

- Advertisement -
- Advertisement -

మూడే మూడు పాత్రలతో, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చి హిట్ కొట్టిన మూవీ భ్రమయుగం! తెలుగునాట ఫిబ్రవరి 23న విడుదలైన భ్రమయుగం హిట్ మూవీగా నిలిచింది. ప్రయోగాలు చేయడంలో ముందుండే మమ్ముట్టి.. తానొక సూపర్ స్టార్ ననే ఇమేజీని పక్కనబెట్టి, విచిత్రమైన పాత్రతో అలరించాడు. మమ్ముట్టి నటన, రాహుల్ సదాశివన్ దర్శకత్వం, క్రిస్టో జేవియర్ సంగీతం –ఈ మూడూ భ్రమయుగం మూవీకి ఆయువుపట్టుగా నిలిచాయి.

విడుదలై నెల రోజులు కాకుండానే భ్రమయుగం ఓటిటిలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ఛానెల్ సోనీ లివ్ ఈ మూవీ హక్కుల్ని దక్కించుకుంది. మార్కి 15నుంచి భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News