Wednesday, May 1, 2024

వావివరసలు మరిచి… రైలు పట్టాలపై పడుకొని

- Advertisement -
- Advertisement -

Brother sister commit suicide in Ananthapuram

 

అమరావతి: వరసకు ఇద్దరు అన్నాచెల్లెళ్లు , వావివరసలు మరిచిపోయి ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పరువుపోతుందని భావించిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి(40)తో ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(38) వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇరుకుటుంబ సభ్యులకు తెలియడంతో పరువు పోతుందని ఇరువురు భావించారు. ఇద్దరు కలిసి గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్‌లోని రైలు స్టేషన్‌కు వెళ్లారు. శివారెడ్డి తన భార్యకు ఫోన్ చేసి ఇవే చివరి మాటలు అని, తాను రాలేనని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. వెంటనే ఇరు కుటుంబాలకు ఫోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. రెండు మృతదేహాలు రైలు పట్టాలపై ఛిద్రమై కనిపించాయి. సిఐ నగేశ్ బాబు, ఎస్‌ఐ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాజ్యలక్ష్మికి ఇద్దరు కూమార్తెలు, కుమారుడు ఉన్నాడు. శివారెడ్డికి కూతురు, కుమారుడు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News