Monday, April 29, 2024

భారత్‌లో చొరబాటుకు ముగ్గురు పాక్ జాతీయుల విఫలయత్నం

- Advertisement -
- Advertisement -

BSF thwarts infiltration of three Pakistani intruders

 

చండీగఢ్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి చొరబడేందుకు ముగ్గురు పాక్ జాతీయులు చేసిన ప్రయత్నాన్ని బిఎస్‌ఎఫ్ దళాలు భగ్నం చేశాయి. బుధవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు పాక్ జాతీయులపై బిఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపినట్లు బిఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. పహారీపూర్ సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద ఉన్న బిఎస్‌ఎఫ్ జవాన్ల కాల్పులతో వెనుకడుగు వేసిన పాకిస్తాన్ జాతీయులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారని ఆయన చెప్పారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన బిఎస్‌ఎఫ్ జవాన్లు పంజాబ్ పోలీసులతో కలసి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News