- Advertisement -
రిగ్గింగ్ ఫిర్యాదులు, బాంబు దాడి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలనుకుంటే మమతా బెనర్జీ భవానీపూర్ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంది. రిగ్గింగ్ కూడా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దాదాపు 40 ఇలాంటి ఫిర్యాదులు అందాయి. అందులో 23 బిజెపి దాఖలు చేసినవే. అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో ఓటింగ్ ఉదయం 7.00 గంటల నుంచే ఆరంభమైంది. సాయంత్రానికి ఓటింగ్ ముగిసే సమయానికి మరిన్ని విశేషాలు అందుతాయి.
- Advertisement -