మనతెలంగాణ/హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఇ) 10వ తరగతి ఫలితాల్లో 99.04 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సిబిఎస్ఇ బోర్డు మంగళవారం ఫలితాలను విడుదల చేయగా, బాలుర కంటే బాలికల్లో 0.35 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్ధుల్లో 57 వేల మంది 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 2 లక్షల మంది విద్యార్ధులు 90 నుంచి 95 శాతం మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది సిబిఎస్ఇ మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఇంకా 16 వేల మంది విద్యార్ధుల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేశారు. ప్రత్యామ్నాయ మదింపు విధానం ద్వారా మార్కులను లెక్కించారు. ఇందులో భాగంగా 20 మార్కులను అంతర్గత సమీక్ష ద్వారా, 80 మార్కులను విద్యార్ధి ఏడాదిలో నిర్వహించిన వివిధ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా కేటాయించారు. సిబిఎస్ఇ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్తో పాటు స్కూల్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సిబిఎస్ఇ పది ఫలితాలు విడుదల
- Advertisement -
- Advertisement -
- Advertisement -