Monday, April 29, 2024

గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ గంజాయి ఘటనపై టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయులు తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఉదాసీనత వహిస్తే గంజాయి మన బిడ్డల వరకూ వస్తుందన్నారు. విచ్చలవిడి గంజాయి వినియోగం యువతను నిర్వీర్వం చేస్తుందని మండిపడ్డారు. విజయవాడ శివారులో గంజాయి మత్తులో జరిగిన గొడవ యువకుడి ప్రాణాలు తీయడంతో ఐదుగురిని హంతకులను చేసిందన్నారు. వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు? అని ప్రశ్నించారు. పక్కప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు.

Also Read: టెక్సాస్ కాల్పులు: త్వరలో హైదరాబాద్‌కు ఐశ్వర్య మృతదేహం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News