Monday, May 13, 2024

కరోనాను జయించిన చింతల

- Advertisement -
- Advertisement -

Chintala Ramachandra Reddy Conquered COVID-19

హైదరాబాద్: బిజెపి సీనియర్ నాయకుడు, ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి కరోనాను జయించారు. ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడంతో చింతలరామచంద్రారెడ్డి తో పాటు ఆయన కుటుంబసభ్యులను ఆసుపత్రినుంచి పంపించారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి చింతల కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి చేరుకున్నారు. పుట్టిన రోజుకు ముందు ఆయన ఇంటికి చేరుకోవడంతో బిజెపి శ్రేణులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా మే నెల చివర్లో చింతల రామచంద్రారెడ్డిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన తోపాటు ఆయన భార్య,కుమారున్ని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్ సందర్భంగా ఆయన పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు భావించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News