రెండు సార్లు వరుసగా ఒలింపిక్స్లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్చరణ్లు జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో ఇటీవల ఘనంగా సత్కరించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాగ్రమ్ వేదికగా షేర్ చేశారు. ఇక, ఈ వేడుకలో కింగ్ నాగార్జున, సీనియర్ కథానాయికలు రాధిక, సుహాసిని, అల్లు అరవింద్, టి. సుబ్బరామిరెడ్డి, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజహరుద్దీన్, చాముండేశ్వరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన పివి సింధుని సత్కరించుకోవడం.. తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
Thank you for being a superb host @KChiruTweets sir 🙏🏽 It was an eventful night with fun loving guests and great conversations! It’s always a pleasure being a part of your cheerful, joyous company! https://t.co/UkoMLJZi24
— Pvsindhu (@Pvsindhu1) August 28, 2021
https://www.instagram.com/chiranjeevikonidela/channel/?utm_source=ig_embed&ig_rid=789dbc15-c46b-4f1f-a69d-2c1d0b94e893
Chiranjeevi and Ram Charan Felicitate PV Sindhu