Friday, April 26, 2024

ఏ ఒక్కరినీ వదలం

- Advertisement -
- Advertisement -

CM KCR

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ
పరీక్షలు, వైద్యం

సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ
సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి
భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్

రైతుకు తిప్పలు రానియ్యం

సజావుగా ధాన్యం సేకరణ, కొనుగోలు చర్యలు

గన్నీ బ్యాగుల కోసం ప్రధానికి ముఖ్యమంత్రి ఫోన్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మ రింత అంకితభావంతో కొనసాగిస్తామని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రోగులకు వైద్యం అందిసున్న వైద్య,ఆరోగ్య సి బ్బందికి ప్రభుత్వం అన్ని రకాలా అండగా ఉ ంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదలకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామని, వ్యాధి సోకిన వారు కలిసిన ప్రతీ ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం రాత్రి పదిగంటల వరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు. “కరోనా వైరస్ వ్యాప్తిని నిరిధించే విషయంలో, వ్యాధి సోకిన వారికి వైద్యం అందించే విషయంలో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తున్నారు.

వారి భద్రతలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిచింది. వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరీక్షలకు, వైద్యానికి వస్తున్న వారికి సరిపడినంతగా టెస్ట్ కిట్స్, పిపిఇలు, మాస్కులు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో పేషంట్ల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా మాస్కులు, పిపిఐలు సేకరిస్తాం” అని సిఎం కెసిఆర్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. సిఎంఆర్‌ఎఫ్ కు వస్తున్న విరాళాలను కూడా వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పిపిఇలు, మందుల కొనుగోలుకు వాడాలని కోరారు. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని సూచించారు.

పూర్తిస్థాయిలో వరికోతలు, ధాన్యం సేకరణ
లాక్ డౌన్ అమలులో ఉన్పప్పటికీ రాష్ట్రంలో వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. “లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించింది. అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, వారు ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

మార్కెట్లలో రద్దీని నివారించడానికి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరికోతలు, ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరగాలి. వరికోతలకు రైతులు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితిని గ్రామాల్లో కల్పించాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఒకేసారి రాకుండా చూడాలి. వారికిచ్చిన కూపన్లలో పేర్కొన్న తేదీ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా రైతులను చైతన్య పరచాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కావల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. రైతుల దగ్గరి నుంచి చివరి గింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులెవరూ తొందరపడొద్దు” అని ముఖ్యమంత్రి కోరారు.

గన్నీ బ్యాగుల కోసం ప్రధానికి సిఎం ఫోన్
రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు తీవ్ర కొరత ఉంది. గన్నీ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ లో ఉన్నాయి. ప్రతీ ఏటా అక్కడి నుంచే బ్యాగులు వస్తాయి. ఈసారి లాక్ డౌన్ కారణంగా బెంగాల్లో పరిశ్రమలు మూత పడడంతో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడిందని సిఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఈ విషయంపై కెసిఆర్ ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమలలను తెరిపించాలని, గన్నీ బ్యాగులు రాష్ట్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి గన్నీ బ్యాగులు చేరుకునే విషయంలో సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

 

CM KCR Review on Prevention of Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News