Monday, April 29, 2024

గ్రూప్-4 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్ 4 పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉదయం నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలో 18118 అభ్యర్థులకు గాను 15737 (86.8537 %) మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షకు మొత్తం 18 118 సిబ్బందికి గాను 15711 (86.714%) మంది హాజరు అయ్యారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది ఇతర శాఖల అధికారులు సమన్వయముతో ముందు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంతమైన వాతావరణం జరిగే విధంగా బందోబస్త్ నిర్వహించారు. గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంతంగా ముగిసే విధంగా కృషి చేసిన అధికారులను అభినందించారు. గ్రూప్ 4 పరీక్షల సందర్బంగా జిల్లా ఎస్పీ వికారాబాద్ పట్టణంలోని, పరిగి పట్టణంలోని పలు ఎగ్జామ్స్ సెంటర్‌లను సందర్శించి బందోబస్త్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News