Monday, April 29, 2024

ఇంజినీరింగ్, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : మన ఊరు, మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులపై బుధవారం ఐడివోసి సమావేశపు హాల్‌లో ఇంజినీరింగ్, కాంట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 43 కోట్లు విలువైన పనులు చేపట్టగా 41 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధుల కొరత లేదని, నిధులు రావడం లేదన్న అపోహను కాంట్రాక్టర్లు నమ్మొద్దని పాఠశాలల బాగుకు ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన పనులుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాని చెప్పారు. ఈ నెలఖరు వరకు 160 నాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News