Monday, April 29, 2024

‘త్వరలో చలో పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి పిలుపునిస్తాం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: శాంతియుతంగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎంపి అంజన్ కుమార్ మండిపడ్డారు. చలో రాజ్‌భవన్ పిలుపు ఇచ్చామని కాంగ్రెస్ నేతలపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అన్నారు. పెట్రోల్ ధరలు. పెగసెస్ సాఫ్ట్‌వేర్‌లకు నిరసనగా ఉద్యమం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. త్వరలో రాజ్‌భవన్ కాదు చలో పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి పిలుపునిస్తామన్నారు.

Cong Ex MP Anjan Kumar fires TS Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News