- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడ, ఎంపి రాహుల్ గాంధీ అరెస్టును వ్యతిరేకిస్తూ ఎంపి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు నగరంలోని బీజెపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకొని ముందుగానే అక్కడి బిజిపి కార్యకర్తలు చేరకోవడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ పై బిజెపి కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజెపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే కాంగ్రెస్ నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఎంపి రేవంత్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.
Congress MP Revanth Reddy Arrest
- Advertisement -