Monday, April 29, 2024

55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

మైనంపల్లి, ఉత్తమ్‌కుమార్‌లకు రెండేసి టికెట్‌లు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో 55 మందికి చోటు కల్పించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్‌లను కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి నుంచి ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ పిసిసి, ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా టికెట్ దక్కింది. కోదాడ నుంచి ఉత్తమ్, హుజూర్ నగర్ నుంచి పద్మావతి బరిలోకి దిగుతున్నారు. భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకు కేటాయిస్తారని ప్రచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది.
సిపిఎంతో పొత్తులు ఖరారయిన తరువాత రెండో జాబితా
నాగార్జున సాగర్ బరిలో ఈసారి జానారెడ్డి బదులు ఆయన కుమారుడు జయవీర్ బరిలోకి దిగనున్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి, ఎంపి కోమటిరెడ్డి నల్గొండ నుంచి, భట్టి వికమార్క మధిర నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్‌లో తూంకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ టికెట్‌ను చింతలపల్లి జగదీశ్వర్ రావును కాదని ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఆశించిన నాగర్ కర్నూల్ టికెట్‌ను కూచకుళ్ల రాజేష్ రెడ్డికి కేటాయించారు. వామపక్షాలతో పొత్తులో భాగంగా సిపిఐకి చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు ఖరారైన సంగతి తెలిసిందే. సిపిఎంతో చర్చలు జరిపి పొత్తులు ఖరారయిన తర్వాత మిగిలిన సీట్లను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే…
1. బెల్లంపల్లి నుంచి- గడ్డం వినోద్, 2. మంచిర్యాల -నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, 3. నిర్మల్ నుంచి -కూచాడి శ్రీహరి రావు, 4. ఆర్మూర్- నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, 5. బోధన్ నుంచి -పి. సుదర్శన్ రెడ్డి, 6. బాల్కొండ- నుంచి సునీల్ కుమార్ ముత్యాల, 7. జగిత్యాల నుంచి -టి. జీవన్ రెడ్డి, 8. ధర్మపురి నుంచి- అడ్లూరి లక్ష్మణ్ కుమార్, 9. రామగుండం నుంచి ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, 10. మంథని- నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, 11. పెద్దపల్లి- నుంచి చింతకుంట విజయ రమణారావు, 12. వేములవాడ- నుంచి ఆది శ్రీనివాస్, 13. మానకొండూర్ -నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 14. మెదక్- నుంచి మైనంపల్లి రోహిత్ రావు, 15. ఆంథోల్ -నుంచి సి. దామోదర రాజనర్సింహ, 16. జహీరాబాద్ నుంచి- ఆగం చంద్ర శేఖర్, 17. సంగారెడ్డి- నుంచి తురుపు జగ్గారెడ్డి, 18. గజ్వేల్- నుంచి తూంకుంట నర్సా రెడ్డి, 19. మేడ్చల్- నుంచి తోటకూరు వజ్రేష్ యాదవ్, 20. మల్కాజిగిరి- నుంచి మైనపల్లి హనుమంత రావు, 21. కుత్బుల్లాపూర్- నుంచి కొలన్ హన్మంత్ రెడ్డి, 22. ఉప్పల్- నుంచి ఎం. పరమేశ్వర్ రెడ్డి, 23. చేవెళ్ల నుంచి- పామెన భీం భారత్, 24. పరిగి నుంచి టి.రామ్మోహన్ రెడ్డి, 25. వికారాబాద్ నుంచి- గడ్డం ప్రసాద్ కుమార్, 26. ముషీరాబాద్- నుంచి అంజన్ కుమార్ యాదవ్, 27. మలక్‌పేట నుంచి- షేక్ అక్బర్, 28. సనత్‌నగర్- నుంచి డా. కోట నీలం, 29. నాంపల్లి- నుంచి మహ్మద్ ఫిరోజ్ ఖాన్, 30. కార్వాన్ నుంచి ఒస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజ్రీ, 31. గోషామహల్ నుంచి- మొగిలి సునీత, 32. చాంద్రాయణగుట్ట – నుంచి బోయ నగేష్ (నరేష్), 33. యాకుత్‌పురా- నుంచి కె.రవి రాజు, 34. బహదూర్ పురా నుంచి -రాజేష్ కుమార్, పులిపాటి, 35. సికింద్రాబాద్- నుంచి ఆడమ్ సంతోష్ కుమార్, 36. కొడంగల్- నుంచి అనుముల రేవంత్ రెడ్డి, 37. గద్వాల్ -నుంచి సరితా తిరుపతయ్య, 38. అలంపూర్ – నుంచి ఎస్‌ఏ సంపత్ కుమార్, 39. నాగర్ కర్నూల్ – నుంచి డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి, 40. అచ్చంపేట నుంచి- డాక్టర్ సికుడు వంశీకృష్ణ,
41. కల్వకుర్తి – నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, 42. షాద్‌నగర్- నుంచి కె. శంకరయ్య, 43. కొల్లాపూర్ -నుంచి జూపల్లి కృష్ణారావు, 44. నాగార్జున సాగర్- నుంచి జయవీర్ కుందూరు, 45. హుజూర్‌నగర్- నుంచి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, 46. కోదాడ – నుంచి నలమాడ పద్మావతి రెడ్డి, 47. నల్గొండ- నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, 48. నకిరేకల్ – నుంచి వేముల వీరేశం, 49. ఆలేరు నుంచి- బిర్లా ఐలయ్య, 50. ఘన్‌పూర్ (స్టేషన్) నుంచి- సింగపూర్ ఇందిర, 51. నర్సంపేట- నుంచి దొంతి మాధవ రెడ్డి, 52. భూపాలపల్లె- నుంచి గండ్ర సత్యనారాయణరావు, 53. ములుగు నుంచి సీతక్క, 54. మధిర – నుంచి భట్టి విక్రమార్క మల్లు, 55. భద్రాచలం- నుంచి పొడెం వీరయ్యలు పోటీ చేయనున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News