Monday, April 29, 2024

మహిళా కానిస్టేబుల్‌ని షూట్ చేసి… కోలీగ్ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఓ పోలీస్ మహిళా కానిస్టేబుల్‌ను గన్‌తో కాల్చి అనంతరం తాను కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గాజ్‌రౌల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేఘా చౌదరీ అనే మహిళా కానిస్టేబుల్, మనోజ్ దూలే అని కానిస్టేబుల్ 2018 బ్యాచ్‌కు చెందిన వారు. అవంతికి నగర్ కాలనీలో మేఘా చౌదరీ అద్దెకు రూమ్ తీసుకొని ఉంటుంది. మనోజ్ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి కలిసి వస్తూ ఉండేవాడు. ఆమె ఇంటికి వెళ్లిన మనోజ్ మేఘాతో గొడవపడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరుకొని గన్ తీసి ఆమె చాతీపై కాల్చిన అనంతరం తాను కాల్చుకున్నాడు. ఇంట్లో శబ్ధం రావడంతో పక్కింట్లో ఉన్న ప్రియా అనే మహిళ వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మనోజ్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానికుల సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పోలీస్ అధికారి ఆర్‌పి శర్మ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇద్దరు మధ్య అక్రమ సంబంధం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మనోజ్ నుంచి పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News