Monday, April 29, 2024

దక్షిణాఫ్రికానుంచి వచ్చిన ఇద్దరికి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona positive for two who came to Bangalore city from South Africa

బెంగళూరులో కలవరం

బెంగళూరు: దక్షిణాఫ్రికానుంచి బెంగళూరు నగరానికి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం అధికారులను కలవర పెడుతోంది. వారికి సాధారణ కరోనాగానే నిర్ధారణ అయిందని, ఇద్దరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. ఈ నెల 1నుంచి 26 వరకు మొత్తం 94 మంది ద క్షిణాఫ్రికానుంచి బెంగళూరుకు రాగా వారిలో ఇద్దరికి సాధారణ కొవిడ్19 నిర్ధారణ అయిందని, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ శనివారం స్పష్టం చేశారు. ఇద్దరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు. శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు. ప్రపంచంలో 10 హైరిస్క్ దేవాలనుంచి ఈ నెల 1నుంచి 26 వరకు బెంగళూరుకు మొత్తం 584 మంది వచ్చారని శ్రీనివాస్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News