- Advertisement -
విజయవాడ: ప్రాణాంతక వ్యాది కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచవ్యప్తంగా విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కరోనా పాజిటీవ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలో కరోనా వైరస్ అనుమానిత కేసు నమోదైంది. ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చిన ఓ యువకుడు జ్వరం, జలుబు వంటి కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. దీంతో డాక్టర్లు అతనిని ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనా నిర్ధారణ కోసం వైద్యులు పేషేంట్ రక్త నమూనాలను సేకరించి తిరుపతిలోని ల్యాబ్ కు పంపించారు.
Coronavirus Suspected case in Vijayawada
- Advertisement -