- Advertisement -
హైదరాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులుగా రైతు ఆందోళన చేస్తున్నారని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని, రైతు సమస్యలను కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని, సిఎం కెసిఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టాలతో కార్పొరేట్లకు మేలు జరుగుతుందన్నారు.
- Advertisement -